"తాను బతికే ఉన్నానని " 19 నెలల పోరాటం తర్వాత స్వదేశానికి ప్రయాణం
- September 10, 2017
కువైట్: ఓ చనిపోయిన వ్యక్తి పేరు ...బతికి ఉన్న వ్యక్తికి ఉండటం ..ఆ ఇద్దరిది ఒకే ప్రాంతం కావడం ఆ భారతీయుడికి పెద్ద శాపం అయింది. వివరాలలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక భారతీయుడు తాను బతికే ఉన్నానని నెలల తరబడి పోరాటం తర్వాత చివరకి తాను పనిచేసే కువైట్ నుంచి ఎట్టకేలకు తన స్వదేశం భారతదేశానికి చేరుకొన్నాడు. 19 నెలల క్రితం...2016 మార్చిలో ఆంధ్రప్రదేశ్ చెందిన నరేష్ తన వార్షిక సెలవులను భారతదేశంలో గడిపేందుకు సిద్ధమై కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొన్నాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశం విడిచి వెళ్లనివ్వకుండా నిరోధించారు. కారణం ఆ పేరు గల ప్రయాణీకుడు ఏనాడో చనిపోయాడు. నీవెవరవని అధికారులు నిలదీసేసరికి నరేష్ నీరుగారిపోయాడు. అనంతరం ఆ వ్యక్తిపై పూర్తి విచారణ తర్వాత, తన పాస్పోర్ట్లో అతికించిన వీసా స్టిక్కర్ అదే పేరుతో ఉన్న మరొక వ్యక్తిధీ అని అతను మరణించాడని అదే పేరుతో మరో వ్యక్తి సజీవంగా ఉన్నట్లు కువైట్ అధికారులు తేల్చారు. విమాన ప్రయాణానికి సిద్ధమైన వ్యక్తి మరణించిన వ్యక్తి కాదని రుజువు చేయటానికి 19 నెలలకాలం పట్టింది. త.ఈ సంఘటన ప్రతి ప్రవాసీయునికి ఒక హెచ్చరికను ఇస్తుంది వారి పాస్పోర్ట్ లో వివరాలు సరైనవి కాదా అని తెల్సుకొని అతికించిన వీసా స్టిక్కర్ వివరాలను తనిఖీ చేసుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







