స్కూల్‌ టీచర్స్‌కి హెచ్చరిక: లేట్‌ అయితే సేలరీ కట్‌

- September 11, 2017 , by Maagulf
స్కూల్‌ టీచర్స్‌కి హెచ్చరిక: లేట్‌ అయితే సేలరీ కట్‌

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా, పబ్లిక్‌ స్కూల్స్‌లో పనిచేసే టీచర్లకు సేలరీకి సంబంధించిన ఓ హెచ్చరిక జారీ అవుతోంది. లేట్‌ అటెండెన్స్‌, అలాగే అన్‌జస్టిఫైడ్‌ ఎర్లీ లీవ్‌కి సంబంధించి ఇకపై సేలరీ కటింగ్‌లు ఉంటాయన్నదే ఆ హెచ్చరిక. ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ రీసోర్సెస్‌ అండ్‌ సర్వీసెస్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ మొహమ్మద్‌ జుమా ఈ మేరకు, హెచ్చరికలు జారీ చేస్తూ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోనివారిపై చర్యలుంటాయన్నారు. డాక్టర్‌ జుమా, ఆగస్ట్‌ 23న సర్క్యులర్‌ విడుదలైనట్లు చెప్పారు. ఆలస్యానికీ, అలాగే సెలవులకు సంబంధించి ఖచ్చితమైన కారణాల్ని చూపని పక్షంలో సేలరీ నుంచి ఆయా కాలానికి అనుగుణంగా, గంటల లెక్కన సేలరీ కటింగ్స్‌ ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. నెలలో మూడు సార్లు మాత్రమే వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా వచ్చేందుకు వీలుంది. 211 స్కూల్స్‌లో పనిచేస్తున్న 18,000 మంది టీచర్లకు ఈ సర్క్యులర్‌ వర్తిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com