తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ 20న ప్రారంభం
- September 14, 2017
తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ఈ నెల 20న ప్రారంభించి 28వ తేదీన దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని కాజీపేట శ్వేతార్కాలయం, శ్రీ భద్రకాళి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతుల కోర్ కమిటీ సభ్యుడు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ సిద్ధాంతి తెలిపారు. కాజీపేట విష్ణుపురిలోని స్వయం భూ శ్వేతార్క మూలగణపతి దేవాలయ దివ్యక్షేత్రం లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన అమవాస్య తిథి ఉదయం 10.13 గంటల వరకు ఉన్నందున పెద్దలకు ఇదే రోజున బియ్యం ఇచ్చుకోవాలని సూచించారు. 19వ తేదీన అపరాహ్నకాలంలో పితృతర్పణములు ఇచ్చుకొనుట, విప్రులు మహాలయ అమవాస్య జరుపుకోవాలని తెలిపారు.
అమవాస్య తిథి సూర్యోదయంలో ఉన్నందున 20వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 21వ తేదీన శరన్నవరాత్రోత్సవ కలశ స్థాపనాది పూజలను ఆరంభించాలని, 24వ తేదీన లలితా పంచమి కావడంతో ఉపాంగ లలితాదేవి వ్రతాన్ని ఆచరించాలని సూచించారు. 27న త్రిరాత్ర కలశ స్థాపన, 28న సరస్వతీ పూజ, దుర్గాష్టమి పండుగలను, 29న మహానవమి, హోమబలిదానములు, 30వ తేదీన విజయదశమి దసరా పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









