టీవీ రిమోట్ కంట్రోల్ కోసం తోబుట్టువుల మధ్య తగాదా... తమ్ముడిపై తీవ్రంగా దాడి
- September 14, 2017
మనామా : తోబుట్టువుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వారిని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. కానీ, అందుకు విరుద్ధంగా ఓ కుటుంబంలో మూడు పదుల వయస్సు పైబడిన పెద్దవాళ్ళు చిన్నపిల్లల మాదిరిగా టీవీ రిమోట్ కంట్రోల్ కోసం ఒకరిని ఒకరు ముష్టి ఘాతాలతో మొఖాలు వాచే విధంగా చావబాదుకొన్నారు. దీనితో రెండవ హై క్రిమినల్ (అప్పీల్) కోర్ట్ ఆ కుటుంబంలో చిన్నవాడైన తమ్ముడిపై దౌర్జన్యం చేసి మొఖం పగలకొట్టిన నేరానికి గాను ఇద్దరు తోబుట్టువులకు10 బెహెరిన్ దినార్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జూన్ 16 వ తేది 2016 లో జరిగిన ఈ సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసిన 32 ఏళ్ల చిన్నవాడైన బాధితుడు తన పెద్ద అన్నయ్య (43) మరియు అక్కయ్య (41)లు కలసి టీవీ రిమోట్ కంట్రోల్ ఉపకరణం దాచేనని అనుమానంతో దారుణంగా కొట్టేరని ముఖ్యంగా మొఖంపై కొట్టారని..అంతేకాక తనని ఒక గదిలో బంధించి..టీవీ రిమోట్ కంట్రోల్ ఎక్కడ దాచేవో చెబితే గాని విడిచిపెట్టమని బెదిరించారని వాపోయాడు. తన అక్క తన సోదరునితో ' వాడిని చావగొట్టి ఇంటికి అవతల పడేయమని ' చెప్పిందని భోరున విలపించాడు. దీంతో పోలీసులు ఆ అన్న ,అక్కలపై కేసులను నమోదు చేసి కోర్టుకి అప్పగించారు.ముద్దాయిలు, సోదరుడు మరియు సోదరిలు 10 బేహారిన్ దినార్ల జరిమానా తీర్పుకి వ్యతిరేకంగా మరో అప్పీల్ దాఖలు చేశారు కానీ కోర్టు దానిని తిరస్కరించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







