నూతన తారలు కావలెను - పూరి జగన్నాధ్
- September 15, 2017
మీరు వెండి తెర ఫై కనిపించాలని , మీ టాలెంట్ తో అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..అయితే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి..ఎందుకంటే త్వరలో పూరి చేయబోయే కొత్త సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకుంటున్నాడు. ఈ మేరకు ప్రకటన చేసాడు. ఇటీవల బాలయ్యతో చేసిన పైసా వసూల్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముస్కాన్. పూరి స్థాపించిన 'పూరి కనెక్ట్' అనే కంపెనీ నుంచి ఈ అమ్మడు వెండి తెర కు పరిచయం అయ్యింది. ఇప్పుడిదే సంస్థ మరోసారి నటీనటుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
18-50ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎవరైనా పూరి కనెక్ట్ ను సంప్రదించవచ్చు. కానీ వాళ్ల దగ్గర యాక్టింగ్ టాలెంట్ ఉండాలి అని తెలిపింది. తన కొత్త సినిమాకు వాళ్లు పనికొస్తారని తెలిస్తే వెంటనే అగ్రిమెంట్ చేసుకోడానికి సంస్థ రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఈ వ్యవహారాలన్నింటినీ చార్మి దగ్గరుండి చూసుకుంటుంది. కాకపోతే నటీనటుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం పూరిజగన్నాధ్ దే. ఫైనల్ లిస్ట్ తయారుచేయడం వరకు చార్మి పని అంటున్నారు.
ప్రస్తుతం పూరి తన కొడుకు ఆకాష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయ్యినట్లు సమాచారం. ఈ మూవీ లోనే కొత్త నటి నటులను తీసుకొన బోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం మిలో టాలెంట్ ఉంటే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







