భారతీయ గృహ కార్మికుల నిషేధ నియామకంను ఎత్తివేసిన కువైట్
- September 18, 2017కువైట్: భారత దేశ మహిళల గృహ కార్మికుల నియామకం పై నిషేధాన్ని ఎత్తివేసినట్లు రెసిడెన్సీ అఫైర్స్ జనరల్ డిపార్ట్మెంట్ పేర్కొంది.గతంలో భారతీయ గృహ కార్మికుల నియామకంపై విధించిన బ్యాంక్ గ్యారంటీని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వం నిర్ణయం కువైట్ పరిగణలోనికి తీసుకుంది. అయినప్పటికీ గత వారంలో భారత ప్రభుత్వం, ఆరు ప్రభుత్వ నియామక ఏజన్సీలకు మాత్రమే కువైట్ కు దేశీయ కార్మికులను నియమించటానికి అధికారం ఇచ్చినట్లు ధృవీకరించింది. అవి ఉత్తరప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పోరేషన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, తెలంగా ఓవర్సీస్ మాన్స్పవర్ కంపెనీ , మరియు ఓవర్సీస్ డెవలప్మెంట్ అండ్ ఎగ్జామినల్ ప్రమోషన్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ , ఓవర్సీస్ మాన్పోవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లుగా ఉన్నాయి. 2014 ల, భారతీయ మహిళా దేశీయ కార్మికుడిని నియమించాలని కోరుకునే ప్రతి యజమాని 2,500 అమెరికా డాలర్ల బ్యాంకు హామీని ఇవ్వాలని కోరింది, అయితే దీనిని భారతదేశం గత వారం రద్దు చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె. అక్బర్ సెప్టెంబర్ 19 మరియు 20 వ తేదీలలో కువైట్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జె ఎం జి) సమావేశంపై కు హాజరు కావాల్సి ఉంది, ఇందులో పలువురికి చెందిన ద్వైపాక్షిక సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ఉద్యోగార్ధుల నియామకాల విషయం చర్చకు రావచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







