మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో డేరా బాబా కూతురు హనీప్రీత్
- September 19, 2017
మొన్నటివరకు ఆమె ఆడిందే ఆట.. పాటిందే పాట. డేరాలో బాబా తర్వాత ఆమెదే టాప్ ప్లేస్. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడామె మోస్ట్వాంటెడ్ లిస్ట్లో నెంబర్ వన్ కిలాడి. ఆమె ఎప్పుడు దొరుకుతుందా అని.. దేశమంతా జల్లెడ పడుతున్నారు పోలీసులు. అత్యాచారం కేసులో గుర్మీత్ రాంరహీం జైలుకెళ్లినట్టే.. ఆయన అనుచరులకు కారాగారయోగం పట్టబోతోంది. ముఖ్యంగా హనీప్రీత్ కోసం సెర్చింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 25న బాబాను దోషిగా కోర్ట్ ప్రకటించి శిక్ష విధించగానే.. ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. నాటి అల్లర్లు 38 మందిని బలిగొన్నాయి. ఆ హింసకు కారకులుగా పోలీసులు 43 మందితో జాబితా విడుదల చేశారు. అందులో.. హనీప్రీత్ సింగ్, ఆదిత్య ఇన్సాన్ టాప్లో ఉన్నారు.
హనీప్రీత్ సింగ్ .. డేరా బాబా గుర్మీత్కు ఆత్మలాంటిది. అల్లర్లకు ఆమె ప్రధాన సూత్రధారిగా పోలీసుల అభియోగం. డేరా నుంచి బాబా కోర్టుకెళ్లే వరకు ఆయన వెంటనే ఉన్న గుర్మీత్.. రోహ్తక్ జైలు వరకు అతనితోనే స్పెషల్ చాపర్లో వెళ్లారు. ఆ తర్వాత నుంచి కనిపించట్లేదు. శిక్ష పడిన వెంటనే.. బాబాను తప్పించేందుకు హనీ ప్రయత్నించిందట. హింస ప్రజ్వరిల్లడంలోను ఆమె పాత్రపై అనుమానాలున్నాయి. అజ్నాతంలోకి వెళ్లిన హనీ కోసం ప్రత్యేక టీమ్లు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ గుండా నేపాల్లోకి పారిపోయే అవకాశాన్ని కొట్టిపారేయడం లేదు. అందుకే.. నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు మోహరించాయి. హనీప్రీత్ వేషం మార్చినా.. పట్టుకునేలా సుశిక్షితులతో నిఘా పెంచారు. వివిధ గెటప్లలోని ఆమె ఫోటోలను పంపిణీ చేస్తూ.. స్థానికుల్ని సైతం అలర్ట్ చేశారు.
మరోవైపు.. ఏ3 ప్రకాష్ ఉరఫ్ విక్కీని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను బాబాకు బంధువు, అత్యంత సన్నిహితుడు. అతినిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఆగస్టు 25న విక్కీనే రోహ్తక్లోని జైలు దగ్గర నుంచి హనీప్రీత్ను బయటకు తీసుకువెళ్లాడు. తర్వాత హిస్సార్ వైపు వెళ్లారు. వీరివెంట ఇంకొందరు ఉన్నారు. పంచకుల హింసలో ప్రకాష్, ఆదిత్య కలిసి పాల్గొన్నట్లు సమాచారం. మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరిచగా.. వారికి కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. వాళ్లిచ్చే సమాచారం ఆధారంగా మిగతావారిని పట్టుకుంటామంటన్నారు పోలీసులు. మోస్ట్ వాంటెండ్ హన్ప్రీత్ సింగ్ను అరెస్ట్ చేస్తే.. అల్లర్ల వెనుకున్న అసలు కుట్ర బయటపడుతుందంటున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







