డాక్టర్స్ క్రికెట్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా అజారుద్దీన్
- September 19, 2017
ఎప్పుడూ పేషెంట్లు, సర్జరీలతో బిజీగా ఉండే డాక్టర్లు క్రికెట్ మైదానంలో సత్తా చాటేందుకు సిధ్ధమవుతున్నారు.మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ క్రికెట్ లీగ్కు వచ్చే వారం తెరలేవనుంది. గత ఐదేళ్ళుగా తెలంగాణాకు పరిమితమైన ఈ లీగ్ను తొలిసారి జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నారు. లీగ్లో హైదరాబాద్ నుంచి రెండు జట్లు బరిలోకి దిగుతుండగా.. మహారాష్ట్ర,కేరళ,మైసూర్,ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్తో పాటు మణిపూర్, జైపూర్ నుంచి కూడా డాక్టర్స్ టీమ్స్ ఆడనున్నాయి. ఈ లీగ్కు సంబంధించిన టీమ్స్ జెర్సీలను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాటు చేయాలన్న తన సూచనను పరిగణలోకి తీసుకున్న మైటీ స్పోర్ట్స్ను అజారుద్దీన్ అభినందించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









