ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- June 05, 2026
విజయవాడ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం ఇక్కడ లోక్భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పర్యావరణ క్షీణతను తగ్గించడానికి చర్యలను వేగవంతం చేయడంపై ప్రాథమికంగా దృష్టి సారించాలని కోరారు.ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ‘ప్రకృతి స్ఫూర్తితో. వాతావరణం కోసం. మన భవిష్యత్తు కోసం’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని గవర్నర్ కోరారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి పి.ఎస్.సూర్య ప్రకాష్, ఉప కార్యదర్శి రఘు, లోక్భవన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!
- KNET లో కొత్తగా డైరెక్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్.. పోర్టల్ అప్గ్రేడ్..!!
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!









