కువైట్లో భారతీయ మహిళ సమయస్ఫూర్తి
- September 19, 2017
కువైట్: ముసుగు దొంగకె ముచ్చెమటలు పట్టించిందా ఆ భారతీయ మహిళ ..విపత్తు సమయంలో వివేకంగా స్పందించిన తీరుకి కువైట్ ప్రభుత్వం ఆ మహిళను అభినందించింది. స్థానిక పత్రికలలో వచ్చిన కధనం ప్రకారం ఆదివారం మహబూలా అనే వ్యాపార సంస్థలోకి ఒక ఆగంతకుడు సాధారణ వ్యక్తి మాదిరిగా ఏదో కొనుగోలు చేసే నెపంతో లోపలకి వచ్చేడు. వారితో కొద్దిసేపు మాట్లాడిన నటించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా తన ముఖం కనిపించకుండా ముసుగు తగిలించుకొని దొంగ మాదిరిగా మారిపోయాడు.. ఆ సమయంలో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఆ సంస్థలో ఉన్నారు. తన వెంట తెచ్చుకున్నతుపాకీని వారిపై గురిపెట్టాడు. డబ్బులిమ్మని డిమాండ్ చేశాడు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన ఉద్యోగులు నోట మాట రాక నిలబడిపోయారు.ముగ్గురు ఉద్యోగుల్లో ఒక భారతీయ మహిళ కాగా, మిగతా ఇద్దరు ఈజిప్టు దేశానికి చెందిన పురుషులున్నారు. ఆ వ్యక్తికి డబ్బులిచ్చేందుకని భారతీయ మహిళ టేబుల్ డెస్కులో చూస్తున్నట్లుగా నటించింది. వెంటనే ఫైర్ అలారమ్ నొక్కింది. సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకుంటూ లోపలికొచ్చేసరికి ఆ వ్యక్తి పారిపోయాడు. భారతీయ మహిళ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను పోలీసులకు అందించారు. పోలీసులు భారతీయ మహిళ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రభుత్వాధికారులు కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







