'ఆక్సిజన్' ఒక ప్రత్యేకమైన సినిమా
- September 22, 2017
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. రాశీ ఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''గోపీచంద్ కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో రాజీ పడకుండా చిత్రీకరణ జరిపాం. గోపీచంద్ ఒక తపనతో పనిచేశారు. జగపతిబాబు పాత్ర కీలకం. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో సిద్ధం చేసిన పాటల్ని అక్టోబరు మొదటివారంలో విడుదల చేస్తాం'' అన్నారు. కిక్శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యుసింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీషిండే, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పోరాటాలు: పీటర్హెయిన్స్, స్టంట్ సిల్వ.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









