తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్న రోబోలు
- September 23, 2017
ఇంతవరకూ ఆపరేషన్లలో డాక్టర్లకు సహాయం చేసిన మరమనుషులు.. ఇప్పుడు తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్నాయి. చైనాలోని ఓ రోబో.. డెంటిస్ట్ అవతారం ఎత్తింది. ఓ పేషెంట్కు.. రెండు పళ్లను ఫిక్స్ చేసింది. డెంటిస్ట్ రోబోను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. మనుషుల సహాయం లేకుండానే ఇది చికిత్స చేయగలదు. మనుషుల వల్ల జరిగే పొరపాట్లేవీ దీనివల్ల జరగవంటున్నారు. చైనాలో ప్రస్తుతం డెంటిస్ట్ల కొరత చాలా ఎక్కువగా ఉందట. ఈ రోబో వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందంటున్నారు.
డెంటింస్ట్ రోబో చేస్తున్న ఫస్ట్ ట్రీట్మెంట్ కావడంతో.. డాక్టర్లు కూడా దానిపక్కనే ఉండి ఎలా చేస్తుందో పరీక్షించారు. అయితే.. దానికి ఎలాంటి సాయం మాత్రం చేయలేదు. అన్ని పనులూ అదే చేసుకుంది. దాదాపు గంటసేపు ట్రీట్మెంట్ చేసిన రోబో.. ఓ మహిళకు జాగ్రత్తగా రెండు కొత్త పళ్లను అమర్చింది. ఈ పళ్లను కూడా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేశారట. ఫస్ట్ ట్రీట్మెంట్ సక్సెస్ కావడంతో.. ఇలాంటి మరిన్ని రోబోలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు చైనా పరిశోధకులు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









