తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్న రోబోలు
- September 23, 2017
ఇంతవరకూ ఆపరేషన్లలో డాక్టర్లకు సహాయం చేసిన మరమనుషులు.. ఇప్పుడు తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్నాయి. చైనాలోని ఓ రోబో.. డెంటిస్ట్ అవతారం ఎత్తింది. ఓ పేషెంట్కు.. రెండు పళ్లను ఫిక్స్ చేసింది. డెంటిస్ట్ రోబోను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. మనుషుల సహాయం లేకుండానే ఇది చికిత్స చేయగలదు. మనుషుల వల్ల జరిగే పొరపాట్లేవీ దీనివల్ల జరగవంటున్నారు. చైనాలో ప్రస్తుతం డెంటిస్ట్ల కొరత చాలా ఎక్కువగా ఉందట. ఈ రోబో వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందంటున్నారు.
డెంటింస్ట్ రోబో చేస్తున్న ఫస్ట్ ట్రీట్మెంట్ కావడంతో.. డాక్టర్లు కూడా దానిపక్కనే ఉండి ఎలా చేస్తుందో పరీక్షించారు. అయితే.. దానికి ఎలాంటి సాయం మాత్రం చేయలేదు. అన్ని పనులూ అదే చేసుకుంది. దాదాపు గంటసేపు ట్రీట్మెంట్ చేసిన రోబో.. ఓ మహిళకు జాగ్రత్తగా రెండు కొత్త పళ్లను అమర్చింది. ఈ పళ్లను కూడా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేశారట. ఫస్ట్ ట్రీట్మెంట్ సక్సెస్ కావడంతో.. ఇలాంటి మరిన్ని రోబోలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు చైనా పరిశోధకులు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







