'మహానుభావుడు' కు అతిధిగా విచ్చేయనున్న ప్రభాస్
- September 24, 2017
హైదరాబాద్: శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మహానుభావుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను నేటి సాయంత్రం నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ దీనికి వేదిక కానుంది. అయితే ఈ వేడుకకు డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మెహరీన్ కథానాయిక పాత్ర పోషించారు. ఎస్. తమన్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు.
వినోదాత్మకంగా సాగే ఈ ప్రచార చిత్రానికి మంచి స్పందన లభించింది. శుభ్రతకు ప్రాణం ఇచ్చే వ్యక్తి పాత్రలో శర్వానంద్ కనిపించారు.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









