సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అంటున్నఎంపీ కవిత
- September 24, 2017
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని ఎంపీ కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో తాను ఇచ్చిన హామీని అమలు చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. తెరాసకు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు వారసత్వ ఉద్యోగాలపై కేసులు వేయించారన్నారు. ప్రభుత్వానికి కార్మికులకు వారిధిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని కార్మికులు గెలిపించాలని ఆమె కోరారు. సింగరేణిలో పనిచేసే కార్మికులను భారత సైనికుడిగా కేసీఆర్ భావిస్తారని కవిత చెప్పారు. తెరాస కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెరాస నేత వేణుగోపాలాచారి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ల సమక్షంలో టీఎన్టీయూసీ, సింగరేణి హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు.
తాజా వార్తలు
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!









