ఇక పై విమానాశ్రయాలలో సీఐఎస్ఎఫ్ భద్రత
- September 24, 2017
ఉడాన్ పేరుతో తక్కువ ఖర్చుతో ప్రాంతీయ అనుసంధానత కల్పించడానికి అమల్లోకి వచ్చిన పథకం కింద వివిధ విమానాశ్రయాలకు అవసరమైన భద్రత కల్పించాలని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. ఉగ్రవాద ముప్పును నివారించడానికి వీలుగా ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించింది. కొత్తగా రాకపోకలు మొదలైన విమానాశ్రయాలకు 13 నుంచి 44 మంది సిబ్బందితో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుంది. శాశ్వత ప్రాతిపదికన వీరిని మోహరించే బదులు విమానాలు రాకపోకలుచేసే సమయాల్లో మాత్రమే సేవలందేలా చేయనున్నామనీ, ఇది ఆర్థికంగానూ మెరుగైన ప్రతిపాదన అనీ సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఒ.పి.సింగ్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. విమానాశ్రయాల వారీగా కాకుండా విమానాల వారీగా భద్రత కల్పించడం ఉభయులకూ ప్రయోజనకరమని చెప్పారు. సమీపంలోని సీఐఎస్ఎఫ్ యూనిట్ నుంచి బలగాలను విమానాశ్రయానికి పంపించి, అన్ని రకాల తనిఖీలను వారి చేత చేయించాక మళ్లీ అదే యూనిట్కు మళ్లిపోయేలా చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించామనీ, అక్కడి నుంచి ఆమోదం లభించాక ఈ తరహా భద్రత అమల్లోకి వస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







