ఇక పై విమానాశ్రయాలలో సీఐఎస్ఎఫ్ భద్రత
- September 24, 2017
ఉడాన్ పేరుతో తక్కువ ఖర్చుతో ప్రాంతీయ అనుసంధానత కల్పించడానికి అమల్లోకి వచ్చిన పథకం కింద వివిధ విమానాశ్రయాలకు అవసరమైన భద్రత కల్పించాలని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. ఉగ్రవాద ముప్పును నివారించడానికి వీలుగా ఈ మేరకు ఒక ప్రణాళికను రూపొందించింది. కొత్తగా రాకపోకలు మొదలైన విమానాశ్రయాలకు 13 నుంచి 44 మంది సిబ్బందితో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుంది. శాశ్వత ప్రాతిపదికన వీరిని మోహరించే బదులు విమానాలు రాకపోకలుచేసే సమయాల్లో మాత్రమే సేవలందేలా చేయనున్నామనీ, ఇది ఆర్థికంగానూ మెరుగైన ప్రతిపాదన అనీ సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఒ.పి.సింగ్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. విమానాశ్రయాల వారీగా కాకుండా విమానాల వారీగా భద్రత కల్పించడం ఉభయులకూ ప్రయోజనకరమని చెప్పారు. సమీపంలోని సీఐఎస్ఎఫ్ యూనిట్ నుంచి బలగాలను విమానాశ్రయానికి పంపించి, అన్ని రకాల తనిఖీలను వారి చేత చేయించాక మళ్లీ అదే యూనిట్కు మళ్లిపోయేలా చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించామనీ, అక్కడి నుంచి ఆమోదం లభించాక ఈ తరహా భద్రత అమల్లోకి వస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









