పూరీ తనయుడితో సినిమా హీరోయిన్ బెంగళూరు భామ నెహాశెట్టి
- September 24, 2017
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్తో సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. రొమాంటిక్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయట. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకాశ్కు జోడీగా బెంగళూరు భామ నెహాశెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. పూరీ సొంత సంస్థ పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. నటి ఛార్మి ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకోనున్నారట.
అక్టోబరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పూరీ అనుకుంటున్నారట. నెహాశెట్టి నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది.
ఆకాశ్ 'చిరుత' చిత్రంలో రామ్చరణ్ చిన్నప్పటి పాత్రతో బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇందులో అతడి నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అతడు మహేశ్బాబు, పవన్కల్యాణ్, ప్రభాస్ సినిమాల్లో బాలనటుడిగా చేశారు. 2015లో 'ఆంధ్రాపోరి' సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







