కుమారి 21ఎఫ్ చిత్ర ఆడియో విడుదలైంది
- October 31, 2015
రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్' చిత్ర ఆడియో విడుదలైంది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో చిత్ర బృందం సమక్షంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ ఆడియో విడుదల జరిగింది. ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రజినీకాంత్, ఐశ్వర్యరాయ్ల సూపర్హిట్ కాబినేషన్లో వచ్చిన 'రోబో' చిత్రానికి పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై నూతన దర్శకుడు, కొత్త మాటల రచయిత వంటి ఎందరికో అవకాశం కల్పిండంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఆడియో సీడీని నటుడు అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కాన్టెస్ట్ విజేతలకు నటుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా బహుమతులను అందించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









