జార్ఖండ్‌ బాణసంచా గోడౌన్‌లో పేలుళ్లు

- September 24, 2017 , by Maagulf
జార్ఖండ్‌ బాణసంచా గోడౌన్‌లో పేలుళ్లు

జార్ఖండ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జంషెడ్‌పూర్‌ సమీపంలోని కుమార్‌డూబి ప్రాంతంలోని ఓ బాణసంచా గోడౌన్‌లో టపాసులు పేలాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. 25 మందికి గాయాలుకాగా... ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com