భారత్ మహిళ 14 సంవత్సరాలు సౌదీలో నరకం అనుభవించారు

- September 25, 2017 , by Maagulf
భారత్  మహిళ 14 సంవత్సరాలు సౌదీలో నరకం అనుభవించారు

సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఓ బాధిత మహిళ మీడియాకు చెప్పింది. తనను జంతువులా హింసించారని.. సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఉడిపి ప్రాంతానికి చెందిన 42 ఏల్ల జసింత మెండోనికాను ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికింది.
కానీ సౌదీ అరేబియాలో యంబు ప్రాంతంలోని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. మెండోనికా పనిచేసే ఇంటి యజమానులు ఆమెను తీవ్రంగా హింసించింది. వాటిని తాళలేక మెండోనికా గత ఏడాది నవంబరులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ అధికారులు ఆమెను పట్టుకుని మళ్లీ యజమాని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత మెండోనికా పరిస్థితి మరీ అధ్వానంగా మారిపోయింది.
ఎంత బతిమలాడుకున్నా కానీ ఆమెకు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారు. ఎట్టకేలకు మెండోనికాను 14 నెలల తర్వాత మానవహక్కుల పరిరక్షణ సంస్థ సిబ్బంది కాపాడింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com