భారత్ మహిళ 14 సంవత్సరాలు సౌదీలో నరకం అనుభవించారు
- September 25, 2017
సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఓ బాధిత మహిళ మీడియాకు చెప్పింది. తనను జంతువులా హింసించారని.. సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఉడిపి ప్రాంతానికి చెందిన 42 ఏల్ల జసింత మెండోనికాను ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ ఖతార్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికింది.
కానీ సౌదీ అరేబియాలో యంబు ప్రాంతంలోని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. మెండోనికా పనిచేసే ఇంటి యజమానులు ఆమెను తీవ్రంగా హింసించింది. వాటిని తాళలేక మెండోనికా గత ఏడాది నవంబరులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ అధికారులు ఆమెను పట్టుకుని మళ్లీ యజమాని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత మెండోనికా పరిస్థితి మరీ అధ్వానంగా మారిపోయింది.
ఎంత బతిమలాడుకున్నా కానీ ఆమెకు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారు. ఎట్టకేలకు మెండోనికాను 14 నెలల తర్వాత మానవహక్కుల పరిరక్షణ సంస్థ సిబ్బంది కాపాడింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







