మెమరీ కార్డ్ కోసం సోదరుడ్ని చంపిన వ్యక్తి
- September 25, 2017
24 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి తన సోదరుడ్ని సిజర్తో పొడిచి చంపేసిన ఘటనకు సంబంధించి అజ్మన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టుకి ఈ కేసును రిఫర్ చేసింది. కెమెరాకి సంబంధించిన మెమరీ కార్డ్ విషయమై అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేవలం 100 దిర్హామ్ల విలువైన మెమరీ కార్డ్ కోసం ఈ హత్య జరగడం ఆందోళన కలిగించే అంశం. గొడవ జరుగుతున్న సమయంలో సోదరుల్ని వారించేందుకు సోదరి తీవ్రంగా ప్రయత్నించినా, గొడవ ముదిరి పాకాన పడ్డం, సోదరులిద్దరూ ఆవేశకావేశాలకు పాల్పడటంతో జరగరాని ఘోరం జరిగిపోయింది. నిందితుడు, సోదరుడితోనూ, సోదరితోనే కాక, తల్లితోనూ మెమరీ కార్డ్ కోసం గొడవపడ్డాడు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









