వేధింపులు తాళలేక మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకిన ఓ ఇండోనేషియా మహిళ
- September 25, 2017
షార్జా: పని మనుష్యులంటే తమ బానిసలు అనుకోని వారిని హీనాతిహీనంగా కొందరు యజమానులు చూస్తున్నారనేది వాస్తవం. ఆ భారతదేశానికి చెందిన ఓ యజమాని వేధింపులు తాళలేక వారి చెర నుంచి బయటపడేందుకు ఓ ఇండోనేషియా మహిళ మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకింది. ఆ ప్రయత్నంలో ఆ మహిళ వికలాంగురాలిగా మారిపోయింది. ఆమె చేసిన సాహసంలో బాధిత మహిళ నడుము, ఓ కాలు విరిగాయి. మూడో అంతస్థు మీద నుంచి ఓ కిటికి గుండా దూకుతున్న ఆమెను ఇరుగుపొరుగువారు గమనించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిస్సహాయస్థితిలో ఎటూ కదలలేని బాధిత మహిళను అల్ కువైటీ హాస్పిటల్కు తరలించారు. మహిళ తీవ్రంగా గాయపడిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. భారత్కు చెందిన యజమాని ఇంట్లో తనతోపాటు మరో మహిళను బంధించాడని, అతడి నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశానని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. బాధిత మహిళ ఇండోనేషియా పౌరురాలని పోలీసులు తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







