వేధింపులు తాళలేక మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకిన ఓ ఇండోనేషియా మహిళ
- September 25, 2017
షార్జా: పని మనుష్యులంటే తమ బానిసలు అనుకోని వారిని హీనాతిహీనంగా కొందరు యజమానులు చూస్తున్నారనేది వాస్తవం. ఆ భారతదేశానికి చెందిన ఓ యజమాని వేధింపులు తాళలేక వారి చెర నుంచి బయటపడేందుకు ఓ ఇండోనేషియా మహిళ మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకింది. ఆ ప్రయత్నంలో ఆ మహిళ వికలాంగురాలిగా మారిపోయింది. ఆమె చేసిన సాహసంలో బాధిత మహిళ నడుము, ఓ కాలు విరిగాయి. మూడో అంతస్థు మీద నుంచి ఓ కిటికి గుండా దూకుతున్న ఆమెను ఇరుగుపొరుగువారు గమనించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిస్సహాయస్థితిలో ఎటూ కదలలేని బాధిత మహిళను అల్ కువైటీ హాస్పిటల్కు తరలించారు. మహిళ తీవ్రంగా గాయపడిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. భారత్కు చెందిన యజమాని ఇంట్లో తనతోపాటు మరో మహిళను బంధించాడని, అతడి నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశానని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. బాధిత మహిళ ఇండోనేషియా పౌరురాలని పోలీసులు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









