ఇండియన్ లాయర్కు ఆల్టర్నేటివ్ నోబెల్ అవార్డు
- September 26, 2017
హైదరాబాద్: పేద ప్రజల హక్కుల కోసం నిత్యం పోరాటం చేసిన భారతీయ లాయర్ కొలిన్ గొంజాల్వెస్కు ఈ ఏడాది ఆల్టర్నేటివ్ నోబెల్ దక్కింది. దీన్నే ద రైట్ లైవ్లీహుడ్ అవార్డుగా పిలుస్తారు. పేదలు, మైనార్టీలు, మహిళలు, పిల్లలు, కార్మికుల హక్కుల కోసం కొలిన్ గొంజాల్వెస్ చాన్నాళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. 1980 నుంచి ఆల్టర్నేటివ్ నోబెల్ను ఇస్తున్నారు. నోబెల్ కమిటీ పట్టించుకోని వ్యక్తులకు రైట్ లైవ్లీహుడ్ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది మొత్తం ముగ్గురు వ్యక్తులకు ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రకటించారు. కొలిన్ గొంజాల్వెస్తో పాటు జర్నలిస్టు ఖదిజా ఇస్మాయిలోవా, ఇథోపియా న్యాయవాది యెట్నబెర్ష్ నిగుసీలు ఉన్నారు. దాదాపు 4 లక్షల డాలర్ల ప్రైజ్మనీని ముగ్గురు పంచుకుంటారు. పిల్ దరఖాస్తులతో అభాగ్యుల జీవితాలను మార్చేందుకు గొంజాల్వెస్ చేస్తున్న ప్రయత్నాలను కొనియాడుతున్నట్లు ఆల్టర్నేటివ్ నోబెల్ కమిటీ పేర్కొన్నది. 1989 నుంచి గొంజాల్వెస్.. హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ సంస్థను నడిపిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఇదే పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్.ఈ గ్రూప్లో సుమారు 200 మంది లాయర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







