ఇండియన్ లాయర్‌కు ఆల్టర్నేటివ్ నోబెల్ అవార్డు

- September 26, 2017 , by Maagulf
ఇండియన్ లాయర్‌కు ఆల్టర్నేటివ్ నోబెల్ అవార్డు

హైదరాబాద్: పేద ప్రజల హక్కుల కోసం నిత్యం పోరాటం చేసిన భారతీయ లాయర్ కొలిన్ గొంజాల్వెస్‌కు ఈ ఏడాది ఆల్టర్నేటివ్ నోబెల్ దక్కింది. దీన్నే ద రైట్ లైవ్లీహుడ్ అవార్డుగా పిలుస్తారు. పేదలు, మైనార్టీలు, మహిళలు, పిల్లలు, కార్మికుల హక్కుల కోసం కొలిన్ గొంజాల్వెస్ చాన్నాళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. 1980 నుంచి ఆల్టర్నేటివ్ నోబెల్‌ను ఇస్తున్నారు. నోబెల్ కమిటీ పట్టించుకోని వ్యక్తులకు రైట్ లైవ్లీహుడ్ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది మొత్తం ముగ్గురు వ్యక్తులకు ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రకటించారు. కొలిన్ గొంజాల్వెస్‌తో పాటు జర్నలిస్టు ఖదిజా ఇస్మాయిలోవా, ఇథోపియా న్యాయవాది యెట్నబెర్ష్ నిగుసీలు ఉన్నారు. దాదాపు 4 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని ముగ్గురు పంచుకుంటారు. పిల్ దరఖాస్తులతో అభాగ్యుల జీవితాలను మార్చేందుకు గొంజాల్వెస్ చేస్తున్న ప్రయత్నాలను కొనియాడుతున్నట్లు ఆల్టర్నేటివ్ నోబెల్ కమిటీ పేర్కొన్నది. 1989 నుంచి గొంజాల్వెస్.. హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్ సంస్థను నడిపిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఇదే పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్.ఈ గ్రూప్‌లో సుమారు 200 మంది లాయర్లు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com