అమెరికాకు మరో షాక్ 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు స్కూళ్లు మూసివేత
- September 27, 2017
నిన్న మొన్నటి వరకు అమెరికాను హరికేన్లు అల్లాడించగా, ఇప్పుడు దావానలం వణికిస్తోంది. వరుస హరికేన్లు.. హార్వే, ఇర్మా, మారియా సృష్టించిన భయోత్పాతం మరువనే లేదు.. తాజాగా 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.
కాలిఫోర్నియాలోని చైనో హిల్స్ స్టేట్ పార్క్లో మొదలైన కార్చిచ్చు ఇప్పటికే 1700 ఎకరాలను బూడిద చేసింది. రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం మొదలైన కార్చిచ్చు ఇప్పటి వరకు 2 వేల ఎకరాలకు వ్యాపించింది.
చెలరేగిపోతున్న కార్చిచ్చును ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓ విమానం సహా 300 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కార్చిచ్చుపై విమానంతో నీళ్లు కుమ్మరిస్తున్నారు.
మరోవైపు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుుకుంటున్నారు. దావానలం కారణంగా సమీప ప్రాంతాల్లోని విద్యాలయాలను మూసివేశారు. 11 ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసరంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







