అక్టోబర్ 2న ఆసుపత్రుల్లో అక్షయ్ కుమార్ నటించిన 'ఏక్ ప్రేమ్ కథ'

- September 28, 2017 , by Maagulf
అక్టోబర్ 2న ఆసుపత్రుల్లో అక్షయ్ కుమార్ నటించిన  'ఏక్ ప్రేమ్ కథ'

బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.  దీనిలో భాగంగానే అక్టోబర్ 2న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించనుంది.  ఆ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం స్వచ్ఛ భారత్ నేపథ్యంతో తీసిన చిత్రం కావున ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని  కేంద్ర ప్రభుత్వం భావించింది.  ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com