కుమారి 21ఎఫ్ చిత్రం ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు
- November 01, 2015
''స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఓ షార్ట్ ఫిలిం చేయాలనుకున్నా. సుకుమార్కి ఫోన్ చేసి ఆఫీసుకు రమ్మన్నాను. యాడ్ ఫిలిం తీద్దామని చెప్పగానే కాన్సెప్ట్ ఏంటి అని అడిగాడే కానీ ఎప్పుడు తీయాలి? ఏంటనే ప్రశ్నలు అడగలేదు. మా ఇద్దరికీ ఉన్న అనుబంధం అలాంటిది. అన్నీ కుదిరితే 'ఆర్య'ను మర్చిపోయేలా సుకుమార్, నేనూ త్వరలో సినిమా చేస్తాం'' అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథ, స్క్రీన్ప్లే అందించిన చిత్రం 'కుమారి 21ఎఫ్'. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రాజ్తరుణ్, హేభాపటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. ఈ చిత్రం ఆడియో సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించి, దర్శకుడు సురేందర్రెడ్డికి అందించారు. ''దర్శకుడు ప్రతాప్ లేకపోతే ఈ సినిమా లేదు. అతనే ఎంకరేజ్ చేసి నాతో ఈ సినిమా స్క్రిప్ట్ రాయించాడు. నేను సినిమా తీద్దామని చెప్పగానే దేవిశ్రీప్రసాద్, రత్నవేలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఏడాది పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. ఇండస్ట్రీలో బంధాలన్నీ కృత్రిమం అని చాలా మంది అంటుంటారు. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. మామూలుగా మనం ఎవరికైనా కాల్ చేస్తే ఎలా ఉన్నారు? అని అడుగుతాం. కానీ నేను బన్నీకి కాల్ చేస్తే అతను అడిగే మొట్టమొదటి మాట 'ఏం కావాలి' అని. నా బ్యాంక్ బన్నీ'' అని సుకుమార్ చెప్పారు. ఈ వేడుకలో బీవీఎస్ఎన్ ప్రసాద్, 'దిల్' రాజు, పి. కిరణ్, బన్నీ వాస్, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్, విజయ్కుమార్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి, రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







