'సైజ్ జీరో' చిత్రం నవంబర్ 26న విడుదల
- November 01, 2015
'సైజ్ జీరో' ఆడియో విడుదలఇంటర్నెట్డెస్క్ అనుష్క, ఆర్య జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సైజ్ జీరో' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని నోవోటెల్లో జరిగింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందించారు. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. 'సైజ్ జీరో' చిత్రం కోసం నటి అనుష్క ఎంతో కష్టపడ్డారని, ఆహార నియమాలని పక్కనపెట్టి పాత్ర కోసం బరువు పెరగడం తన నిబంద్ధతకి నిదర్శనం అని కితాబిచ్చారు దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు బి.గోపాల్, రాజమౌళి, రాఘవేంద్రరావు, వంశీపైడిపల్లి, నటుడు రానా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







