ముంబయిలో తొక్కిసలాట..15మంది దుర్మరణం

- September 28, 2017 , by Maagulf
ముంబయిలో తొక్కిసలాట..15మంది దుర్మరణం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ప్రమాదం చోటుచేసుకుంది.స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15మంది మృతిచెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. వంతెనపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com