భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ!

- September 30, 2017 , by Maagulf
భారతీయ నేరస్తుల పట్ల దయ చూపిన కువైట్.. కృతజ్ఞతలు తెలిపిన సుష్మ!

కువైట్‌ జైళ్లలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 15 మంది భారతీయుల శిక్షను కువైట్‌ రాజు రద్దు చేశారు. వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. దీంతో పాటు జైళ్లలో మగ్గుతున్న మరో 119 మంది భారతీయుల శిక్షను తగ్గింపునకు రాజు ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
భారత ఖైదీల శిక్ష తగ్గింపు పట్ల సుష్మాస్వరాజ్‌ సంతోషం వ్యక్తంచేశారు. దీనిపై కువైట్‌ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి జైళ్ల నుంచి విడుదల కాబోయే వారికి అక్కడి భారత రాయభార కార్యాలయం సహకారం అందిస్తుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com