తెలంగాణలో ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ అమలు
- September 30, 2017
తెలంగాణలో పాతమద్యం దుకాణాల గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. ఇవాళ్టి (అక్టోబర్ 1) నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుంది. గతనెల 12న టీ. సర్కార్ ఈ నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది.
రెండు గంటలు పెంపు..
రెండు సంవత్సరాల పాలసీలో ఇప్పుడున్న సమయం కంటె రెండు గంటల ఎక్కువ సమయం మద్యం అమ్ముకోవచ్చని తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. కాగా నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది. మద్యం దుకాణాలలో తప్పనిసరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా చేయాల్సినవి..
ప్రతి మద్యం దుకాణంలో తప్పనిసరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలి.
హెచ్పీఎఫ్ఎస్ సిస్టం(బార్ కోడింగ్ కొరకు) ఏర్పాటు చేసుకోవాలి.
ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరపాలి.. లేనిచో కఠిన చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







