భారత్కు నిత్యం తలనొప్పులు సృష్టిస్తోన్న చైనా
- October 01, 2017
అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో చైనా కొత్త ఎక్స్ప్రెస్ హైవేను ఆదివారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి న్యియింషి వరకు 409 కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.3.78లక్షల కోట్లు (5.8 యూఎస్ డాలర్లు) ఖర్చు చేశారు. న్యియింషి అనే ప్రాంతం భారత్లోని అరుణాచల్ప్రదేశ్కు చేరువలో ఉన్నది. చైనాలోని రెండు ప్రముఖ పర్యాటక నగరాలను కలుపుతూ ఈ రహదారిని నిర్మించినట్టు అక్కడి మీడియా పేర్కొన్నది. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. టిబెట్లో నిర్మించిన అనేక ఎక్స్ప్రెస్ హైవేలను సైనికదళాలు, ఆయుధాలను తరలించేందుకు చైనా ఉపయోగిస్తున్నది. భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వివాదాస్పదంగా ఉన్నది. అరుణాచల్ప్రదేశ్ కూడా టిబెట్లోని దక్షిణ ప్రాంతమని చైనా వాదిస్తున్నది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









