భారత్‌కు నిత్యం తలనొప్పులు సృష్టిస్తోన్న చైనా

- October 01, 2017 , by Maagulf
భారత్‌కు నిత్యం తలనొప్పులు సృష్టిస్తోన్న చైనా

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో చైనా కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను ఆదివారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి న్యియింషి వరకు 409 కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.3.78లక్షల కోట్లు (5.8 యూఎస్ డాలర్లు) ఖర్చు చేశారు. న్యియింషి అనే ప్రాంతం భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు చేరువలో ఉన్నది. చైనాలోని రెండు ప్రముఖ పర్యాటక నగరాలను కలుపుతూ ఈ రహదారిని నిర్మించినట్టు అక్కడి మీడియా పేర్కొన్నది. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. టిబెట్‌లో నిర్మించిన అనేక ఎక్స్‌ప్రెస్ హైవేలను సైనికదళాలు, ఆయుధాలను తరలించేందుకు చైనా ఉపయోగిస్తున్నది. భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వివాదాస్పదంగా ఉన్నది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమని చైనా వాదిస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com