అల్లు అర్జున్ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న చరణ్
- October 01, 2017
మెగా హీరోల మల్టీస్టారర్ సినిమా పై అందరికీ ఆసక్తే... ఎప్పటి నుంచో అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని మెగా అభిమానుల కోరిక.. ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో తెలియదు కానీ.. త్వరలో బన్నీ, చెర్రీ లు కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.. అవును అల్లు అర్జున్ తాజా సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించనున్నారట. బన్నీ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్న "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" . ఈ సినిమాలో చరణ్ అతిధిగా కనిపించనున్నారట.. 2014 లో రామ్ చరణ్ ఎవడు సినిమాలో బన్నీ అతిధిగా నటించగా ఆ సినిమా ఎంతటి హిట్ సాధించిందో తెలిసిందే... మరో సారి ఈ బావ బావమరుదుల జంట వెండి తెరపై మెగా అభిమానులకు కనువిందు చేయనున్నదట.. అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ సినిమా 2018 ఏప్రిల్ లో వేసవి వినోదంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







