అబుధాబీలో 21,000 మందికి పైగా రెడ్ సిగ్నల్ అతిక్రమణ
- November 02, 2015
రాజధానిలో ఇంచుమించు అన్ని కూడళ్ల వద్ద కూడా అత్యాధునిక కెమెరాలు అమర్చబడి ఉన్నాయని తెలిసి కూడా, 2015 సంవత్సరపు మొదటి తొమ్మిది నెలల్లో 21,851 మంది రెడ్ సిగ్నల్ ను అతిక్రమించినట్టు, అబుధాబీ ట్రాఫిక్ పోలీసు వారి ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు రోడ్ సేఫ్టీ విభాగం డైరక్టర్ - లెఫ్టనెంట్ కల్నల్ బద్ర్ అహ్మద్ అల్ హార్తి ప్రకటించారు. ప్రమాదాలను నివారించడానికి కూడళ్లను సమీపించేటపుడు వేగాన్నీ తగ్గించవలసిందిగా మరల మరల విజ్ఞప్తులు చేసినా వారు పెడచెవిన పెడుతున్నారని, ఈ విధమైన అతిక్రమణ దారులకు 800 దిర్హాం ల జరిమానా, రెండు వారాలపాటు వారి వాహన స్వాధీనం మరియు వారి ట్రాఫిక్ రికార్డులో 8 బ్లాక్ పాయింట్లు శిక్షగా విధింపబడుతుందని ఆయన తెలియజేప్పారు. ఈ కొత్త కెమెరాలు - రెడ్ సిగ్నల్ అతిక్రమించిన, వేగ పరిమితిని అధిగమించిన, సిగ్నల్స్ వద్ద హఠాత్తుగా దిశ మార్చుకున్న, యెల్లోబాక్స్ లేదా పాదచారుల నడక దారిపై ఆగిన వాహనాల చోదకులను కనిపెట్టగలవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







