ఎమిరేట్స్ హరికేన్పై సౌదీ అరబ్ రేంజర్స్ విజయం
- October 02, 2017
మనామా: సౌదీ అరబ్ రేంజర్స్, ఎమిరేట్స్ హరికేన్ని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 2017 అరబ్ క్రికెట్ కార్నివాల్ టీ20 ఏడవ మ్యాచ్, రిఫ్ఫాలోని బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో జరగ్గా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ హరికేన్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కపిల్ యాదవ్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌదీ అరబ్ రేంజర్స్ కేవలం 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అమ్జాద్ ఖాన్ 83 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే, సంజయ్ కనోలియా 58 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. బహ్రెయిన్ క్రికెట్ సెంటర్, కెహెచ్కె ఎంఎంఎ బహ్రెయిన్ సంయుక్తంగా ఈ ఈవెంట్ని నిర్వహించాయి. ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్, హానరరీ ప్రెసిడెంట్ బహ్రెయిన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ డిజేబులిటీస్ షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆరు టీమ్లు, నలుగురు చొప్పున అంతర్జాతీయ ఆటగాళ్ళు, 12 మంది ఆటగాళ్ళు జీసీసీ దేశాలకు చెందినవారు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. గత బుధవారం ఈ టోర్నమెంట్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









