ఎమిరేట్స్ హరికేన్పై సౌదీ అరబ్ రేంజర్స్ విజయం
- October 02, 2017
మనామా: సౌదీ అరబ్ రేంజర్స్, ఎమిరేట్స్ హరికేన్ని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 2017 అరబ్ క్రికెట్ కార్నివాల్ టీ20 ఏడవ మ్యాచ్, రిఫ్ఫాలోని బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో జరగ్గా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ హరికేన్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కపిల్ యాదవ్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌదీ అరబ్ రేంజర్స్ కేవలం 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అమ్జాద్ ఖాన్ 83 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే, సంజయ్ కనోలియా 58 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. బహ్రెయిన్ క్రికెట్ సెంటర్, కెహెచ్కె ఎంఎంఎ బహ్రెయిన్ సంయుక్తంగా ఈ ఈవెంట్ని నిర్వహించాయి. ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్, హానరరీ ప్రెసిడెంట్ బహ్రెయిన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ డిజేబులిటీస్ షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆరు టీమ్లు, నలుగురు చొప్పున అంతర్జాతీయ ఆటగాళ్ళు, 12 మంది ఆటగాళ్ళు జీసీసీ దేశాలకు చెందినవారు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. గత బుధవారం ఈ టోర్నమెంట్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







