హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం
- October 02, 2017
మరో మూడు రోజులు హైదరాబాద్కు వర్ష సూచన ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నట్టు చెప్పారు. మరోవైపు అండమాన్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.
దసరా, గాంధీ జయంతి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి ఆఫీసులు ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారికి.. నరకం చూపించనున్నాయి రోడ్లు. రాత్రి కురిసిన వర్షంతో నిలిచిన నీటిని దాటుకుని వెళ్లాలంటే.. ప్రజలకు తిప్పలు తప్పవు. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం.. హైదరాబాద్లోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







