ఉగ్రదాడుల వీడియోలు చూస్తున్నారా అయితే జైలు శిక్షకు సిద్దంకండి
- October 03, 2017
- బ్రిటన్ ప్రభుత్వ హెచ్చరిక
యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం పట్ల బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన వ్యకం చేస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రదాడులకు సంబంధించిన వీడియోల పట్ల ఆకర్షితులై వందలాది మంది యువతీయువకులు ఉగ్రసంస్థల్లో చేరుతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ద్వారా గుర్తించింది. దీంతో, ఆన్లైన్లో ఉగ్రసంస్థల దాడుల వీడియోలను చూస్తున్న నెటిజన్లపై కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఇకపై ఉగ్రదాడుల వీడియోలను వీక్షించే నెటిజన్లకు 15ఏండ్ల జైలుశిక్ష విధించనున్నట్టు హెచ్చరించింది. మంగళవారం లండన్ నగరంలో కన్సర్వేటివ్ పార్టీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ హోంశాఖ మంత్రి అంబర్ రూడ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్లో గతంలో జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఐఎస్ ఉగ్రసంస్థకు చెందిన ఆన్లైన్ లింక్లను 44వేల మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో బ్రిటన్లో యాసిడ్ దాడుల ఘటనలు పెరిగిపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







