బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి రూ.2,077 కోట్లు స్వాహా
- October 03, 2017
బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన దుండగులు అర కిలోమీటరు మేర సొరంగ మార్గాన్ని తవ్వి బ్యాంకులోకి చొరబడ్డారు. 317మిలియన్ డాలర్లు ( రూ. 2077కోట్లు ) కొల్లగొట్టారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు..బ్యాంకు నుంచి 500 మీటర్ల దూరంలో భారీ సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. సొరంగ మార్గంలో పెద్ద ఎత్తున ఆహారపదార్థాల నిల్వలు, శీతల పానీయాలు, ఇతర నిత్యా వసర సరుకులను గుర్తించారు. సొరంగమార్గాన్ని తవ్విన దుండగులు ఈ నిల్వలు సమకూర్చుకున్నట్టు గుర్తించారు. ఈకేసులో 16మంది నింది తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నాలుగు నెలల పాటు సొరంగాన్ని తవ్వినట్టు ప్రాథమిక విచారణలో నిందితులు అంగీకరించారు. ప్రపంచంలో జరిగిన చోరీల్లో ఇదే అతిపెద్దదని పోలీస్ అధికారి లోప్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







