పర్సనల్‌ లోన్స్‌ కోసం ఏజ్‌ లిమిట్‌ పెంచాలన్న బహ్రెయిన్‌ ఎంపీ

- October 04, 2017 , by Maagulf
పర్సనల్‌ లోన్స్‌ కోసం ఏజ్‌ లిమిట్‌ పెంచాలన్న బహ్రెయిన్‌ ఎంపీ

మనామా: బహ్రెయినీ ఎంపీ ఒకరు, పర్సనల్‌ లోన్స్‌ కోసం ఏజ్‌ లిమిట్‌ని పెంచాలని కోరుతున్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ ఎంపవర్‌మెంట్‌ కోసం ఈ చర్య తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండిపెండెంట్‌ ఎంపీ ఇసా టుర్కి, ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పలు కమర్షియల్‌ బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లు లోన్ల కోసం పెట్టుకుంటోన్న అప్లికేషన్లను వారి వయసు కారణంగా తిరస్కరిస్తున్నారని చెప్పారాయన. 65 ఏళ్ళు పైబడినవారికి బ్యాంకులు లోన్లు ఇవ్వడంలేదని ఇసా టుర్కి వివరించారు. సీనియర్‌ సిటిజన్స్‌ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారాయన. త్వరలో జరగనున్న లెజిస్లేటివ్‌ సెషన్‌లో ఎంపీ ఇసా టుర్కి డిమాండ్లపై చర్చ జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com