ఎక్సయిజ్ ట్యాక్స్ ఉల్లంఘన: 17 దుబాయ్ షాప్లపై కేసులు
- October 04, 2017
దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, 17 ట్రేడింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్పై కేసులు నమోదు చేశాయి. ఎనర్జీ డ్రింక్స్ సహా పలు ప్రోడక్ట్స్పై ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సయిజ్ ట్యాక్స్ విషయమై ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున ఆ షాప్లపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పొగాకు ఉత్పత్తులు అలాగే ఎనర్జీ డ్రింక్స్పై 100 శాతం, కార్బొనేటెడ్ డ్రింక్స్పై 50 శాతం ఎక్సయిజ్ ట్యాక్స్ని విధించగా, అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ట్యాక్స్ అమల్లోకి రాకముందే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా కొన్ని షాప్లపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఉల్లంఘనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమర్షియల్ కంప్లియాన్స్ అండ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అలి రషీద్ లూటా చెప్పారు.
తాజా వార్తలు
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం









