తెలుగు జర్నలిస్టులకు ఇండీవుడ్ పురస్కారాలు
- October 04, 2017
ఇండియన్ సినిమా పరిశ్రమని అంతర్జాతీయ వేదికలకు ప్రమోట్ చేసే క్రమంలో ఏర్పాటయిన ఇండీవుడ్, ప్రింట్, విజువల్, ఆన్లైన్ మరియు రేడియో మీడియాకి చెందిన పలువురికి పురస్కారాల్ని అందించింది. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఎవిఎన్హెచ్ఎస్ శర్మ (ఈనాడు), ఖాజా ఖయ్యుమ్ అన్వర్ (టి న్యూస్), ఆనందం పులిపాలుపుల (వసుంధర), జయదేవ్ రెంటాల (ఆంద్రజ్యోతి)లకు అందజేయడం జరిగింది. ప్రత్యేక గుర్తింపు అవార్డుల కేటగిరీలో కె.నాగేశ్వరారవు (యుఎన్ఐ), సుబ్బారావు నాగభైరు (ఆంధ్రజ్యోతి), రాంబాబు వర్మ లంక (తెలుగు 360 డాట్ కామ్), జి.ఆనంద్కుమార్ (ఈటీవీ సినిమా), జలపతి గూడెల్లి (టీవీ9), పి.వి. రమణకుమార్ (మహాన్యూస్), రమేష్ చందు (బాక్సాఫీస్ సినిమా), కృష్ణా కంబాలపల్లి (టిఎన్ఎన్ న్యూస్), ఎ.రాజాబాబు (వన్ ఇండియా), ఆర్ఎస్జె థామస్ (ఫొటో జర్నలిస్ట్), పి.ఆర్.కె. ప్రపసాద్ (ఆంధ్రప్రభ), క్రాంతి కిరణ్ (టీవీ1), యు.శ్రీనివాస్ (గ్రేట్ తెలంగాణ), మున్నలూరు మారుతి ప్రసాద్ (సిఎన్ఎన్ న్యూస్), జెబిఎస్ ఉమానాథ్ (డెక్కన్ హెరాల్డ్), యు.వినాయకరావు (ఆంధ్రజ్యోతి) తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ ఫౌండర్ డైరెక్టర్ సోహన్ రాయ్, డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు హైద్రాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో మూడవ ఎడిషన్ - ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ జరుగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







