సైంటిఫిక్, జియోలాజికల్ సహకారంపై ఇరు దేశాల సంతకాలు
- October 06, 2017
మాస్కో : సౌదీ అరేబియా యొక్క జియోలాజికల్ సర్వే మరియు రష్యా జియోలాజికల్ కార్పొరేషన్ మధ్య శుక్రవారం పరస్పర అవగాహన పత్రంపై ( మెమోరాండం అఫ్ అండర్ స్టాండింగ్ (ఎం ఓ యు ) సంతకాలు జరిగేయి. పరస్పర ప్రయోజనం ఆధారంగా, శాస్త్ర, భౌగోళిక రంగాలలో రెండు దేశాల మధ్య సహకారాన్ని అభివృద్ధి చేయటానికి ఉద్దేశించిన ఈ సహకారం భూగర్భజల నమూనా, సముద్రపు భూగర్భ శాస్త్రం, భూగర్భ, ఖనిజ మరియు పర్యావరణ అధ్యయనాలు, భౌగోళిక శాస్త్రాలు మరియు భౌగోళిక సమాచార వ్యవస్థల యొక్క అసమాన ఉపయోగాలు, భూగోళ పరిశోధన మరియు వనరుల అంచనా, ఖనిజాల గుర్తింపు మరియు భూగర్భ జలాశయాల అన్వేషణ, భూగర్భజలీకరణం, పర్యావరణ అధ్యయనాలు, భౌగోళిక సమాచార వ్యవస్థలు మధ్య ఉంటుంది. సౌదీ అరేబియా నుండి సౌదీ జియోలాజికల్ సర్వే యొక్క ఛైర్మన్, డా. జుహైర్ర్ బిన్ అబ్దుల్హాఫిజ్ నవాబ్ మరియు రష్యన్ వైపు నుండి రష్యన్ భూగర్భ ఇన్స్టిట్యూట్ హోల్డింగ్ యొక్క జనరల్ సూపర్వైజర్ సీనియర్ డిప్యూటీ రుస్లాన్ గోరింగ్ మధ్య పరస్పర అవగాహన పత్రంపై ( మెమోరాండం అఫ్ అండర్ స్టాండింగ్ (ఎం ఓ యు ) సంతకాలు జరిగేయి. రెండు వర్గాల కమిటీలు ఒప్పందం యొక్క అమలు కోసం రహదారి సూచికను రూపొందించడమే కాక వాటిని విధిగా అనుసరించాల్సి ఉంటుంది. ఆయా నిబంధనలను అమలు చేయడం, అలాగే సౌదీ అరేబియా మరియు రష్యా దేశాల మధ్య సాధ్యమైన భవిష్యత్ సహకార అవకాశాలు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









