మహిళలకు శుభవార్త ఇక పై బంగారం కొనుగోలుకు పాన్ కార్డు అవసరం లేదు

- October 06, 2017 , by Maagulf

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. యాభైవేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పాన్‌కార్డును సమర్పించాలని గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ముందుగా రెండులక్షల రూపాయల ఆభరణాలు కొన్నపుడు నో యువర్ కస్టమర్ కింద వారి పాన్ కార్డును అందజేయాలని కేంద్రం ఆదేశించింది. అనంతరం దాన్ని 50వేల రూపాయల కొనుగోళ్లకు కూడా పాన్ కార్డును సమర్పించాల్సిందేనని ప్రకటించింది. ఈ నిబంధన వల్ల బంగారం అమ్మకాలు తగ్గిపోయిందని బంగారం వర్తకులు ఆందోళన చేసిన నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కేంద్రం తాజా ఆదేశాలతో దీపావళి పండుగ సందర్భంగా బంగారం విక్రయాలు జోరందుకుంటాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com