మహిళలకు శుభవార్త ఇక పై బంగారం కొనుగోలుకు పాన్ కార్డు అవసరం లేదు
- October 06, 2017మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. యాభైవేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా పాన్కార్డును సమర్పించాలని గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ముందుగా రెండులక్షల రూపాయల ఆభరణాలు కొన్నపుడు నో యువర్ కస్టమర్ కింద వారి పాన్ కార్డును అందజేయాలని కేంద్రం ఆదేశించింది. అనంతరం దాన్ని 50వేల రూపాయల కొనుగోళ్లకు కూడా పాన్ కార్డును సమర్పించాల్సిందేనని ప్రకటించింది. ఈ నిబంధన వల్ల బంగారం అమ్మకాలు తగ్గిపోయిందని బంగారం వర్తకులు ఆందోళన చేసిన నేపథ్యంలో కేంద్రం తాత్కాలికంగా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కేంద్రం తాజా ఆదేశాలతో దీపావళి పండుగ సందర్భంగా బంగారం విక్రయాలు జోరందుకుంటాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









