'తెలంగాణ ప్రజా సమితి-ఖతార్' నేతృత్వంలో మహా బతుకమ్మ,దసరా మరియు బక్రీద్ సంబరాలు
- October 08, 2017
ఖతార్: ఖతార్లో గుర్తింపు పొందిన ఇండియన్ కల్చరల్ సెంటర్కి అనుబంధంగా ఉన్న 'తెలంగాణ ప్రజాసమితి' ఆధ్వర్యంలో మహా బతుకమ్మ, దసరా అలాగే బక్రీద్ సంబరాలు జరిగాయి. ఖతార్లో ఇండియన్ ఎంబాసిడర్ పి.కుమరన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రజా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా వక్తలు అభినందించారు. టిపిఎస్ ప్రెసిడెంట్, శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ, తమ సంస్థ సోషల్ అలాగే వెల్ఫేర్ కార్యక్రమాల్ని చేపడుతోందని చెప్పారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేందుకు అవకాశం రావడం గొప్ప విషయమని చెప్పారాయన. ఖతార్లో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినవారున్నారని, అలాంటివారిలో కొత్త ఉత్సాహం నింపేందుకు టీపీఎస్ పలు కార్యక్రమాల్ని కొనసాగిస్తుందని వివరించారు శ్రీధర్. ఫోక్, క్లాసికల్ డాన్సులు, మోడ్రన్ నృత్యాలు ఆహూతుల్ని అలరించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)



తాజా వార్తలు
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్









