రియల్ కధ ఆధారంగా సిద్ధార్థ్ 'గృహం'

- October 10, 2017 , by Maagulf
రియల్ కధ ఆధారంగా సిద్ధార్థ్ 'గృహం'

చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధార్థ్‌. ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో గృహం అనే చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. మణిరత్నం శిష్యుడు మిళింద్‌ రావ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో సిద్దు సరసన ఆండ్రియా జెర్మియా, అతుల్‌ కుల్‌కర్ణి నటిస్తున్నారు. ఈ మూవీ నవంబర్‌లో విడుదలకానుంది.
అయితే నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని సిద్దు స్వయంగా వెల్లడించారు. మిళింద్‌కు, తనకు కామన్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి విషయంలో జరిగిన సంఘటనను తీసుకుని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. సినిమా సెట్స్‌పైకి తీసుకు రావడానికి ముందే అన్ని పర్మిషన్స్ తీసుకున్నట్టు సిద్దు తెలిపారు. సిద్ధార్థ్‌ సొంత నిర్మాణ సంస్థ ఎటకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com