ఎన్ఓఎల్ కార్డులు వినియోగిస్తే ఉచిత కూపన్స్
- October 11, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), లాయల్టీ పాయింట్స్ ప్రోగ్రామ్ని ఎన్ఓఎల్ కార్డుల కోసం ప్రారంభించనుంది. ఎన్ఓఎల్ ప్లస్ ప్రోగ్రామ్, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఎన్ఓఎల్ కార్డుదారులు పాజిటివ్ పాయింట్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లు, కూపన్లు మరియు ఓచర్లుగా మార్చుకునేందుకు వీలుంది. కేఫ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెటర్లలో వీటి ద్వారా ఫ్రీ సర్వీసెస్ పొందవచ్చు. ఆర్టిఎ కార్పొరేట్ టెక్నాలసీ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ - ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఖాలిద్ అల్ అవధి మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నుంచి ఈ ప్రోగ్రామ్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తొలిసారిగా ఎన్ఓఎల్ కార్డుదారులు లాయల్టీ పాయింట్స్ పొందేందుకు వీలుంటుందని వివరించారాయన. మెట్రో, పబ్లిక్ బస్లు, ట్రామ్, మెరైన్ట్రాన్స్పోర్ట్ విభాగాల్ని, అలాగే పార్కింగ్ పేమెంట్ చేసేవారికి, ఎతిహాద్ మ్యూజియం, పబ్లిక్ పార్కుల్లో ఎన్ఓఎల్ కార్డులు వినియోగించేవారికి లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. వాటిని కూన్లుగా మలచుకుని ఫుడ్, ఎంటర్టైన్మెంట్ జోన్లలో వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







