సౌదీ ఆయుధాల వినియోగంపై నిఘా పెట్టిన బ్రిటన్
- October 11, 2017
- ఐరాసలో బ్రిటన్ రాయబారి మ్యాథ్యూ రిక్రాఫ్ట్
సౌదీ అరేబియా ఆయుధాల వినియోగంపై నిఘా పెట్టినట్టు ఐరాసలో బ్రిటన్ రాయబారి మ్యాథ్యూ రిక్రాఫ్ట్ తెలిపారు. బ్రిటన్ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను సౌదీ అరేబియా..ఉగ్ర సంస్థలకు సరఫరా చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో బ్రిటన్ రాయబారి పై విధంగా స్పందించారు. కాగా, యెమెన్లోని పౌర నివాసాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని సౌదీ సంకీర్ణదళాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. సౌదీ సంకీర్ణదళాల దాడుల్లో ఎందరో అమాయకులు మృతి చెందారు. సౌదీ తీరుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాకుండా, సౌదీకి ఆయుధాల సరఫరాను తక్షణమే నిలిపివేయాలని బ్రిటన్ను పౌర సంఘాలు అభ్యర్థిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం...2016లో సౌదీ సంకీర్ణదళాలు జరిపిన వైమానిక దాడుల్లో 683 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఐరాస నివేదికను రిక్రాఫ్ట్ తప్పుపట్టారు.
సౌదీ అరేబియాకు బ్రిటన్ ఆయుధాలు సరఫరా చేయడంలో తప్పేమీ లేదని లండన్ కోర్టు తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ హక్కుల సంఘాల అభ్యర్థనను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తీర్పు ప్రకారం..సౌదీ ఆయుధాల వినియోగాన్ని పర్యవేక్షిస్తు న్నామని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







