బెంగళూరులో బారి వర్షాలు పూజారి గల్లంతు
- October 13, 2017
బెంగళూరుపై మళ్లీ వరుణుడు పంజా విసిరాడు. వర్ష బీభత్సంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు కాలువలు ఉప్పొంగాయి. కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ప్రజలు భయభ్రాంతాలకు గురయ్యారు. బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్, హోసూర్ రోడ్, మల్లేశ్వరం, నృపతుంగ రోడ్, కస్తూరి బా రోడ్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్లియర్ చేయడం పోలీసుల వల్ల కాలేదు.
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
భారీ వర్షాలకు గోడ కూలి నలుగురు చనిపోయారు. రాజా కాల్వలో పూజారి వాసుదేవ్ వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళనలు చెందుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







