బెంగళూరులో బారి వర్షాలు పూజారి గల్లంతు

- October 13, 2017 , by Maagulf
బెంగళూరులో బారి వర్షాలు పూజారి గల్లంతు

బెంగళూరుపై మళ్లీ వరుణుడు పంజా విసిరాడు. వర్ష బీభత్సంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు కాలువలు ఉప్పొంగాయి. కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ప్రజలు భయభ్రాంతాలకు గురయ్యారు. బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్, హోసూర్ రోడ్, మల్లేశ్వరం, నృపతుంగ రోడ్‌, కస్తూరి బా రోడ్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. 
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
భారీ వర్షాలకు గోడ కూలి నలుగురు చనిపోయారు. రాజా కాల్వలో పూజారి వాసుదేవ్ వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళనలు చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com