బెంగళూరులో బారి వర్షాలు పూజారి గల్లంతు
- October 13, 2017బెంగళూరుపై మళ్లీ వరుణుడు పంజా విసిరాడు. వర్ష బీభత్సంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు కాలువలు ఉప్పొంగాయి. కాలువలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ప్రజలు భయభ్రాంతాలకు గురయ్యారు. బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్, హోసూర్ రోడ్, మల్లేశ్వరం, నృపతుంగ రోడ్, కస్తూరి బా రోడ్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్లియర్ చేయడం పోలీసుల వల్ల కాలేదు.
భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
భారీ వర్షాలకు గోడ కూలి నలుగురు చనిపోయారు. రాజా కాల్వలో పూజారి వాసుదేవ్ వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళనలు చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!