మన పతాకం ఐకమత్యం, ఆత్మ గౌరవాలకు చిహ్నం : యు. ఏ. ఈ . ప్రధాని

- November 04, 2015 , by Maagulf
మన పతాకం ఐకమత్యం, ఆత్మ గౌరవాలకు చిహ్నం : యు. ఏ. ఈ . ప్రధాని

యు. ఏ. ఈ .  ఫ్లాగ్  డే సందర్భంగా, యు. ఏ. ఈ .  ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయి పరిపాలకుడు హిస్ హైనేస్ షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం, దుబాయి క్రీక్ పార్కులో , 100 కు పైగా దేశాలకు చెందిన 5000 మంది బాలల మధ్య యు. ఏ. ఈ .  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ , జాతీయ విలువలను, దేశభక్తిని  పెంపొందించడంలో ఈ రోజుకు గల ప్రాముఖ్యతను మరో సారి నొక్కి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇటీవలే హిజ్ హైనేస్ మొహమ్మద్ వారిచే అమోదించబడిన ఏకీకృత జాతీయ గీత అ లాపన కార్యక్రమం కొనసాగింది. కేబినేట్ వ్యవహారాల మంత్రి, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గర్వారీ మరియు ఇతర ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com