కువైట్ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- October 15, 2017
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పర్సనల్ ఆరుగురు సభ్యుల డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేసింది. వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స యాంఫిటమైన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. 2 మిలియన్లకు పైగా కాప్టగాన్ పిల్స్ని స్మగ్లింగ్ చేసే యత్నాన్ని భగ్నం చేయడం జరిగిందని మినిస్ట్రీకి చెందిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. యాంటీ నార్కోటిక్స్ జనరల్ డైరెక్టరేట్, ఈ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. వివిధ దేశాలకు చెందినవారి సహకారంతో ఓ వ్యక్తి విమానయానం ద్వారా డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. విచారణలో నిందితుడు మరో స్మగ్లింగ్ యత్నం గురించి సమాచారం అందించడంతో, ఇద్దరు సిటిజన్స్ని అరెస్ట్ చేశారు. ఇందులో కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు తెలియవస్తోంది. 300 కాప్టగాన్ పిల్స్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









