బెంగళూరులో సిలిండర్ పేలి..ముగ్గురు మృతి..కూలిన నాలుగు ఇళ్లు..శిధిలాల కింద 50 మంది
- October 16, 2017
బెంగళూరులో సిలిండర్ పేలుడు ప్రకంపనలు సృష్టించింది. ఎజ్జిపుర ప్రాంతంలో భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. ఆ ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అందులో ఉన్న వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బెంగళూరు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.
భారీ శబ్దంలో పేలుడు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వైపు పేలుడు.. మరోవైపు వెంటనే భవనాలు కూలిన శబ్దం రావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. చుట్టుపక్కల వారు పరుగున వచ్చి. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శిథిలాల కింద నుంచి హాహాకారాలు వినిపించాయి. వెంటనే స్థానికులు మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిలిండర్ పేలుడు ఇంత భయంకరంగా ఉంటుందని అక్కడి వారు ఊహించలేకపోతున్నారు. శిథిలాల కింద కనీసం మరో 50 మంది ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. వారందరినీ బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









