బెంగళూరులో సిలిండర్ పేలి..ముగ్గురు మృతి..కూలిన నాలుగు ఇళ్లు..శిధిలాల కింద 50 మంది
- October 16, 2017
బెంగళూరులో సిలిండర్ పేలుడు ప్రకంపనలు సృష్టించింది. ఎజ్జిపుర ప్రాంతంలో భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. ఆ ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అందులో ఉన్న వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బెంగళూరు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు.
భారీ శబ్దంలో పేలుడు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వైపు పేలుడు.. మరోవైపు వెంటనే భవనాలు కూలిన శబ్దం రావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. చుట్టుపక్కల వారు పరుగున వచ్చి. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శిథిలాల కింద నుంచి హాహాకారాలు వినిపించాయి. వెంటనే స్థానికులు మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిలిండర్ పేలుడు ఇంత భయంకరంగా ఉంటుందని అక్కడి వారు ఊహించలేకపోతున్నారు. శిథిలాల కింద కనీసం మరో 50 మంది ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. వారందరినీ బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







