ఫాలో ట్రాఫిక్ రూల్స్: లేదంటే అంతే సంగతులు
- October 16, 2017
దుబాయ్: నిబంధనల్ని కాదని 50 శాతం మించి టింటెడ్ గ్లాస్ కలిగిన వాహనాన్ని వినియోగిస్తున్నారా? 1,500 దిర్హామ్ల జరీమానాని ఎదుర్కోక తప్పదు. ఇదొక్కటే కాదు, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆయా ఉల్లంఘనలకు సంబంధించి భారీ జరీమానాలు తప్పవు. వాహన ఇంజిన్లో మార్పులు చేస్తే గనుక 2,000 దిర్హామ్ల జరీమానాతోపాటు 12 బ్లాక్ పాయింట్స్ భరించాల్సిందే. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లో మాట్లాడినా, ఆఖరికి ఎస్ఎంఎస్లు పంపినా జరీమానాలు కఠినంగా ఉంటాయి. రోడ్లపై ప్రమాదాలు తగ్గించడానికి జరీమానాలు, బ్లాక్ పాయింట్లు తప్పనిసరి అవుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. నిబంధనల్ని కఠినతరం చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయనీ, ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య కూడా తగ్గుతోందని అధికారులు వెల్లడించారు. రోడ్లపై మీరు ప్రదర్శించే అతి జాగ్రత్త మీకు ప్రమాదకరం మాత్రమే కాదు, ఇతరులకూ హానికరం. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







